ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల లొల్లి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… తన కేబినెట్ సహచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఏపీ కేబినెట్ సమావేశం చివరిలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు మంత్రులకు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… తన కేబినెట్ సహచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఏపీ కేబినెట్ సమావేశం చివరిలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నెల 21న తొలిదశ, 24న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 27న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 29వ తేదీన కౌంటింగ్తో పాటు.. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మరోవైపు జిల్లా పరిషత్తుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బిసి రిజర్వేషన్ లపై వార్ నడుస్తోంది. ఇప్పుడీ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లతో ప్రక్రియ నడుస్తోంది. స్థానిక సంస్థల్లో 59. శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ గత డిసెంబర్ లో 176 జీవోను విడుదల చేసింది రాష్ట్రప్రభుత్వం. దీనిపై కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడినుంచి కేసు హైకోర్టుకు వచ్చింది. విచారణ తరువాత 50 శాతం రిజర్వేషన్లకు పరిమితం చేసింది హైకోర్టు.
దీనిపై పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. టీడీపీ నేతలు ఢిల్లీవెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఉన్న రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం ఎస్టిలకు 6.77 శాతం ఎస్సిలకు 19. 08 శాతం రిజర్వేషన్లు అమలుకావాలి. 50 శాతంలో వారివాటా తీసేస్తే 24. 15 శతం బిసిలకు వర్తిస్తాయి. అంటే గతంలోకన్నా వారికీ దాపు 10 శాతం రిజర్వేషన్లు తగ్గుతాయనేది టిడిపి చేస్తోన్న వాదన.
అయితే.. 2013లో అప్పటి ప్రభుత్వం అన్ని కుల సంఘాల సహకారంతో బడుగు బలహీన వర్గాలకు 60.55 శాతం రిజర్వేషన్లపై సానుకూలంగా స్పందించి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేలా చేసింది. కానీ 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు 2013 ఎన్నికల వరకే పరిమితం అని చంద్రబాబు అప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి, ఇప్పటి స్థానిక సంస్థల ఎన్నికలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ కావాలని పేర్కొనడం చిత్రంగా ఉందని వైసీపీ నేతలు విమర్శించారు.