బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్!
ఇక ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపించకపోవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్ ఏటీఎం వినియోగదారులకు తీపికబురు అందించింది. బ్యాంకులు వాటి ఏటీఎంలను డబ్బులతో నింపకపోతే ఇక పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్బీఐ ఈమేరకు బ్యాంకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. బ్యాంకులు మూడు గంటల కన్నా ఎక్కువసేపు ఏటీఎంలను ఖాళీగా ఉంచరాదు. ఇలా జరిగితే సంబంధిత బ్యాంకులు జరిమానాలు చెల్లించాల్సిందే. చిన్న పట్టణాలు ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం ఎక్కువగా చూస్తుంటాం. బ్యాంకులు ఏకంగా కొన్ని […]
ఇక ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపించకపోవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్ ఏటీఎం వినియోగదారులకు తీపికబురు అందించింది. బ్యాంకులు వాటి ఏటీఎంలను డబ్బులతో నింపకపోతే ఇక పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్బీఐ ఈమేరకు బ్యాంకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
బ్యాంకులు మూడు గంటల కన్నా ఎక్కువసేపు ఏటీఎంలను ఖాళీగా ఉంచరాదు. ఇలా జరిగితే సంబంధిత బ్యాంకులు జరిమానాలు చెల్లించాల్సిందే. చిన్న పట్టణాలు ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం ఎక్కువగా చూస్తుంటాం. బ్యాంకులు ఏకంగా కొన్ని రోజుల పాటు వీటిని డబ్బులతో నింపవు. సాధారణంగా ఏటీఎంలలో సెన్సార్లు ఉంటాయి. ఇవి డబ్బులు ఏ రేంజ్లో ఉన్నాయో బ్యాంకులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి. కాగా ఆర్బీఐ ఇటీవలే ఏటీఎం లావాదేవీలు, చార్జీలపై కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే.