Bank Merger: ఏప్రిల్ 1 నుంచి ‘మెగా’ విలీనం.. ఏయే బ్యాంక్లు కలవనున్నాయంటే..!
పది ప్రభుత్వ రంగ బ్యాంక్లను 4 బ్యాంక్లుగా కుదించే విలీన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరం చేశామని ఆమె అన్నారు.
పది ప్రభుత్వ రంగ బ్యాంక్లను 4 బ్యాంక్లుగా కుదించే విలీన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరం చేశామని ఆమె అన్నారు. అయితే 10 ప్రభుత్వ రంగ బ్యాంక్లను నాలుగు బ్యాంక్లుగా కుదించాలని కేంద్రం గతేడాది ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభించిందని.. విలీన విషయమై బ్యాంక్లతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నామని నిర్మలా వివరించారు. ఈ విలీనానికి నియంత్రణ పరమైన ఎలాంటి సమస్యలు లేవని ఆమె స్పష్టం చేశారు. దేశంలో ప్రపంచస్థాయి బ్యాంక్లను తయారు చేసేందుకు.. అలాగే సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కించేందుకే కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విలీనం వలన దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంక్లు మాత్రమే ఉండనున్నాయి.
మెగా విలీనంపై ప్రభుత్వ ప్రతిపాదన ఎలా ఉందంటే..!
1.ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కలపడం. దీని వలన రెండో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్లా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవతరించనుంది. 2.కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ను విలీనం చేయడం. దీని వలన కెనరా బ్యాంక్ నాల్గవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్గా అవతరించనుంది. 3. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్లను యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడం. దీని వలన ఐదవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్గా యూనియన్ బ్యాంక్ అవతరించనుంది. 4. ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ను విలీనం చేయడం. దీని వలన ఏడవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్గా ఇండియన్ బ్యాంక్ అవతరించనుంది.