సీఏఏకి వ్యతిరేకంగా బంగ్లా విద్యార్ధిని పోస్టులు.. దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆర్డర్స్..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ కొందరు ముస్లింలు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్కు సంబంధించిన ఓ విధ్యార్ధినిని.. సీఏఏకి వ్యతిరేకంగా పోస్టింగ్స్ చేసింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ కొందరు ముస్లింలు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్కు సంబంధించిన ఓ విధ్యార్ధినిని.. సీఏఏకి వ్యతిరేకంగా పోస్టింగ్స్ చేసింది. అయితే చదువుకునేందుకు మన దేశం వచ్చి.. మనదేశ చట్టాలను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టడం దుమారం రేపింది. సదరు యవతి వెస్ట్ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను పరిశీలించిన యువతి.. రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో.. డిసెంబర్లో సీఏఏను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు చేసింది. అయితే ఇది గ్రహించిన అక్కడి విద్యార్ధులు బంగ్లా విద్యార్ధినిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని భారత విదేశాంగ శాఖకు తెలిసేలా చేశారు. దీంతో సదరు యువతిని దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.