ఆ సెంటిమెంట్.. బాలయ్యను గెలిపిస్తుందా..!
సినీ నటుడు బాలకృష్ణ సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. అది సినిమాలైనా సరే.. రాజకీయాలైనా సరే.. ఒక్కసారి తనకు ఏదైనా విజయం వచ్చిందంటే ఆ తోవలో వెళ్లేందుకే ఆయన మక్కువ చూపుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం ఎన్నికల లెక్కింపు జరగనుండగా.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ను బాలయ్య నమ్ముతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య తొలిసారిగా పోటీ పడిన వేళ, లెక్కింపు జరిగే సమయంలో అనంతపురంలోని ఆర్టీసీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బస చేశారు. […]
సినీ నటుడు బాలకృష్ణ సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. అది సినిమాలైనా సరే.. రాజకీయాలైనా సరే.. ఒక్కసారి తనకు ఏదైనా విజయం వచ్చిందంటే ఆ తోవలో వెళ్లేందుకే ఆయన మక్కువ చూపుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం ఎన్నికల లెక్కింపు జరగనుండగా.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ను బాలయ్య నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య తొలిసారిగా పోటీ పడిన వేళ, లెక్కింపు జరిగే సమయంలో అనంతపురంలోని ఆర్టీసీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బస చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో ఆ గది కాస్త సెంటిమెంట్గా మారింది. దీంతో గురువారం అదే రూమ్లో బస చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నారట. అయితే ఆ గదిని అప్పటికే అధికారులు మరొకరికి కేటాయించగా.. తాజాగా బాలయ్య కోరిక మేరకు వారి చేత ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ సాయంత్రం నుంచే బాలయ్య అక్కడ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇదంతా పక్కనపెడితే మిక్స్డ్ సర్వేలతో ఏపీలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా మరికొన్ని గంటల్లో ఏపీలో ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ కౌంటింగ్ జరగనుంది.