నేడు ఎన్టీఆర్ జయంతి… నివాళులర్పించిన బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను పూలతో అలంకరించారు. ఈ ఉదయం 7 గం.లకే అక్కడికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ…ఎన్టీఆర్ […]
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను పూలతో అలంకరించారు. ఈ ఉదయం 7 గం.లకే అక్కడికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ…ఎన్టీఆర్ పుట్టినరోజును తెలుగు ప్రజలు ఓ పండుగలా భావిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లోకి యువతను ఆహ్వానించిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని గుర్తు చేశారు.