ఈ నెల 30 న బాబ్రీ కేసు తీర్పు, అద్వానీ సహా నిందితులు హాజరు కావలసిందే !
దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చివేసిన 28 ఏళ్ళ నాటి బాబ్రీ మసీదు కేసులో కోర్టు ఈ నెల 30 న తీర్పు ప్రకటించనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్.కె. యాదవ్ ఆ రోజున తీర్పునివ్వనున్నారు. ఈ కేసులో..
దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చివేసిన 28 ఏళ్ళ నాటి బాబ్రీ మసీదు కేసులో కోర్టు ఈ నెల 30 న తీర్పు ప్రకటించనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్.కె. యాదవ్ ఆ రోజున తీర్పునివ్వనున్నారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న బీజేపీ అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, పార్టీ సీనియర్ నేత ఉమా భారతి తదితరులు కోర్టుకు హాజరు కావలసి ఉంటుంది. 1992 డిసెంబరులో వీరి కుట్ర ఫలితంగానే 15 వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. వీరి నేతృత్వంలో కరసేవకులు నాడు ఆ మసీదును కూల్చివేశారు. గత జులై 24 న అద్వానీ ఈ కేసులో స్పెషల్ సీబీఐ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలమిచ్చారు. అంకుముందు రోజే జోషీ కూడా తన వాదన వినిపించారు. ఈ కేసులో తమపై వఛ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, తమ తప్పేమీ లేదని వీరు పేర్కొన్నారు.