వేటాడి అంతం చేయాలి: బాబా రాందేవ్
పాకిస్థాన్పై విరుచుకుపడ్డ బాబా రాందేవ్ ఆ దేశంతో సత్సంబంధాలు ఎప్పటికీ సాధ్యం కావు న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై యోగా గురు బాబా రాందేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు. పరిణితిలేని దేశంగా వ్యవహరిస్తోన్న పాక్కు భారత ప్రధాని మోడీ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మాటలు ఎన్ని చెప్పినా ఫలితం ఉండదని, చేతలు ఉండాలని ఆయన అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయిన మసూద్ అజహర్ను […]
- పాకిస్థాన్పై విరుచుకుపడ్డ బాబా రాందేవ్
- ఆ దేశంతో సత్సంబంధాలు ఎప్పటికీ సాధ్యం కావు
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై యోగా గురు బాబా రాందేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు. పరిణితిలేని దేశంగా వ్యవహరిస్తోన్న పాక్కు భారత ప్రధాని మోడీ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మాటలు ఎన్ని చెప్పినా ఫలితం ఉండదని, చేతలు ఉండాలని ఆయన అన్నారు.
పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయిన మసూద్ అజహర్ను ఎక్కడున్న భారత్కు తీసుకురావాలి. లేదంటే ఒసామా బిన్ లాడెన్కు పట్టిన గతే పట్టాలని అన్నారు. 2008లో ముంబైలో ఉగ్రదాడుల సూత్రదారి సయ్యద్ హఫీజ్ను కూడా పట్టుకుని భారత్కు తీసుకురావాలన్నారు బాబా రాందేవ్.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి. పాకిస్థాన్తో సత్సంబాధాలు ఎప్పటికీ సాధ్యం కావు, ఎందుకంటే పాక్ ఆ సత్సంబంధాలను కోరుకోవడంలేదని బాబా రాందేవ్ అన్నారు. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40కిపైగా సీఆర్పిఎఫ్ జవాన్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే.