Good news.. కరోనాకు మందు రెడీ ! బాబా రామ్ దేవ్
కోవిడ్ని అరికట్టగల సరైన వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పతంజలి వ్యవస్థపకుడు బాబా రామ్దేవ్ గుడ్న్యూస్ చెప్పారు. కరోనాను అంతమొందించగల వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ప్రమాద భరితంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ని అరికట్టగల సరైన వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పతంజలి వ్యవస్థపకుడు బాబా రామ్దేవ్ గుడ్న్యూస్ చెప్పారు. కరోనాను అంతమొందించగల వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
కరోనా వ్యాధి నుంచి కోలుకునేందుకు మందు సిద్ధంగా ఉందని యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ ప్రకటించారు. ప్రాణాంతక కరోనా వ్యాధికి విరుగుడు తమ వద్ద ఉందన్నారు. గిలోయ్ , అశ్వగంధ కాంబినేషన్ తో కరోనాకి చికిత్స చేయవచ్చునని రామ్ దేవ్ బాబా సూచించారు. కరోనా మన శరీరంలోకి చొచ్చుకుపోయి మొత్తం కణాలు, వ్యవస్థను నాశనం చేస్తుంది. అది శరీరంలోని ఇతర కణాలకు సోకుతుంది. అశ్వగంధ, గిలోయ్ ఆ శరీరం లోపల సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో 100శాతం ప్రభావమంతంగా పని చేస్తాయి. కరోనా రోగులకు గిలోయ్, అశ్వగంధ, తులశివతి ఖాళీ కడుపుతోనూ, తిన్న తరువాత కూడా ఇచ్చామని చెప్పారు. ఫలితంగా 100 శాతం రికవరీ, జీరో శాతం మరణ రేటు ఉందని తెలిపారు. ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ ట్రయల్ జరుగుతోందని త్వరలో అందుబాటులోనికి తీసకువస్తామని రామ్ దేవ్ బాబా అన్నారు.