కేసీఆర్ గురించి ‘బాహుబలి’ నిర్మాత ట్వీట్.. కేటీఆర్ సమాధానం
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోన్న వేళ అన్ని వలస కార్మికుల పరిస్థితి ధీనంగా మారింది. ఎంతోమంది తమ పిల్లలతో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోన్న వేళ అన్ని వలస కార్మికుల పరిస్థితి ధీనంగా మారింది. ఎంతోమంది తమ పిల్లలతో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు. వారి పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ నేపథ్యంలో వారి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఔదార్యం చాటారు. తెలంగాణలో ఉన్న వలసదారులందరినీ తమ బిడ్డల్లాంటి వారేనని.. ఒక్కొక్కరికి రూ.500 నగదు, 12 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై యావత్తు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జాతీయ మీడియాలు కవర్ చేయలేదు. ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాత జాతీయ మీడియాలపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
మా ముఖ్యమంత్రి ప్రెస్మీట్లను మీరు ఎందుకు చూపించడం లేదు. తెలంగాణలో కరోనాపై చేస్తోన్న యుద్ధానికి సంబంధించి ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వలసదారులు, రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ విషయాలన్నీ జాతీయ మీడియాలలో ఎందుకు చూపించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. ఏదైనా ఢిల్లీ(జాతీయ)మీడియా అయి ఉంటే ఎన్సీఆర్(జాతీయ రాజధాని ప్రాంతం) పరిధిని మించి చూడాలి అని అన్నారు. కాగా ఈ ట్వీట్పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. జాతీయ మీడియా తీరును వ్యతిరేకిస్తూ.. కేసీఆర్పై వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read This Story Also: ప్రభాస్ ఫస్ట్లుక్పై పూజా ఏమందంటే..!
Sir already vibrations bayalu modalainai…PM candidate KCR ani…andukenemo mana news cover cheyyaru.mana KCR pressmeet transcript national media ki iyyali…janalu picholaipotharu…intha subject depth unna CM evvaru lerani. Mana Telangana ki aithe oka pedda dhikku undani happy
— Gopi Krishna (@GopiAlisetty) March 29, 2020