అయోధ్య తీర్పుపై దేశ ప్రజలకు మోదీ అభ్యర్థన..
వివాదస్పద అయోధ్య భూవివాదంపై శనివారం ఉదయం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించి.. శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా.. అది ఒకరి విజయంగానో, మరొకరి ఓటమిగానో పరిగణించకూడదని సూచించారు ప్రధాని. కోర్టు తీర్పు వెలువడిన కూడా శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. ‘అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఎవరికీ […]
వివాదస్పద అయోధ్య భూవివాదంపై శనివారం ఉదయం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించి.. శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా.. అది ఒకరి విజయంగానో, మరొకరి ఓటమిగానో పరిగణించకూడదని సూచించారు ప్రధాని. కోర్టు తీర్పు వెలువడిన కూడా శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మోదీ.
‘అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఎవరికీ ఓటమి కూడా కాదు. ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలి. దేశ ప్రజలంతా శాంతి, సోదరభావంతో మెలగాలని కోరుకుంటున్నాను. న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక – సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం అంతా కలసిమెలసి నిలబడదామని’ మోదీ పేర్కొన్నారు.
अयोध्या पर कल सुप्रीम कोर्ट का निर्णय आ रहा है। पिछले कुछ महीनों से सुप्रीम कोर्ट में निरंतर इस विषय पर सुनवाई हो रही थी, पूरा देश उत्सुकता से देख रहा था। इस दौरान समाज के सभी वर्गों की तरफ से सद्भावना का वातावरण बनाए रखने के लिए किए गए प्रयास बहुत सराहनीय हैं।
— Narendra Modi (@narendramodi) November 8, 2019
देश की न्यायपालिका के मान-सम्मान को सर्वोपरि रखते हुए समाज के सभी पक्षों ने, सामाजिक-सांस्कृतिक संगठनों ने, सभी पक्षकारों ने बीते दिनों सौहार्दपूर्ण और सकारात्मक वातावरण बनाने के लिए जो प्रयास किए, वे स्वागत योग्य हैं। कोर्ट के निर्णय के बाद भी हम सबको मिलकर सौहार्द बनाए रखना है।
— Narendra Modi (@narendramodi) November 8, 2019
अयोध्या पर सुप्रीम कोर्ट का जो भी फैसला आएगा, वो किसी की हार-जीत नहीं होगा। देशवासियों से मेरी अपील है कि हम सब की यह प्राथमिकता रहे कि ये फैसला भारत की शांति, एकता और सद्भावना की महान परंपरा को और बल दे।
— Narendra Modi (@narendramodi) November 8, 2019