బ్రేకింగ్ : ఆయేషా మీరా డెడ్బాడీకి ‘రీ-పోస్టుమార్టమ్’..!
‘దిశ’ ఘటన దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేపిందో తెలిసిందే. నిందితులు ఎన్కౌంటర్లో చనిపోవడంతో మెజార్టీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ డబ్బున్న బడాబాబులు, రాజకీయ నేతల కొడుకులు కూడా తప్పులు చేస్తే.. పోలీసులు, ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దిశ ఇన్సిడెంట్ తర్వాత నిర్భయ దోషుల మరణశిక్ష విషయంలో కదలికలు ఫాస్ట్గా జరిగాయి. త్వరలోనే వారిని ఉరి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం మహిళల భద్రతకు […]
‘దిశ’ ఘటన దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేపిందో తెలిసిందే. నిందితులు ఎన్కౌంటర్లో చనిపోవడంతో మెజార్టీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ డబ్బున్న బడాబాబులు, రాజకీయ నేతల కొడుకులు కూడా తప్పులు చేస్తే.. పోలీసులు, ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దిశ ఇన్సిడెంట్ తర్వాత నిర్భయ దోషుల మరణశిక్ష విషయంలో కదలికలు ఫాస్ట్గా జరిగాయి. త్వరలోనే వారిని ఉరి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. విమెన్ సేఫ్టీ చట్టంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే చారిత్రాత్మక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, యాసిడ్ దాడుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి, కచ్చితమైన ఆధారాలుంటే 21 రోజుల్లోనే ఉరి శిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది.
మరోవైపు ఏపీలో 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు విషయంలో సీబీఐ కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలోనే ఆయేషా మీరా డెడ్బాడీకి ‘రీ-పోస్టుమార్టమ్’ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీబీఐ..లోకల్ ఆఫీసర్స్తో సంప్రదింపులు జరుపుతోంది. డిసెంబరు 20 లోగానే ‘రీ-పోస్టుమార్టమ్’ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం.