ఆ ప్లేయర్స్కు 36 గంటల క్వారంటైన్!
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్లు ముగియడంతో.. ఆయా జట్ల ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్ చేరుకున్నారు. ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం వీరు 6 రోజుల క్వారంటైన్లో ఉండాలి.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్లు ముగియడంతో.. ఆయా జట్ల ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్ చేరుకున్నారు. ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం వీరు 6 రోజుల క్వారంటైన్లో ఉండాలి. కానీ ఆ రూల్స్ను సడలించారని ఐపీఎల్ అధికారి ఒకరు వెల్లడించారు. 6 రోజులకు బదులు కేవలం 36 గంటలు మాత్రమే వారు క్వారంటైన్లో ఉంటారని స్పష్టం చేశారు. (Australia And England Players)
దీని వల్ల అన్ని జట్లకు మొదటి మ్యాచ్ నుంచే ప్రధాన ఆటగాళ్లను ఆడించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు బయోబబుల్లో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని.. వారికి 36 గంటల తర్వాత కరోనా టెస్టులు చేస్తామని.. నెగటివ్ వస్తే సరాసరి బరిలోకి దిగుతారని ఐపీఎల్ అధికారి తెలిపారు.
I will continue to open the innings for @mipaltan in the #Dream11IPL: MI captain @ImRo45 ?️? pic.twitter.com/Mx5yEhtaeN
— IndianPremierLeague (@IPL) September 17, 2020
Also Read:
Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!