ఏపీలో వాలంటీర్లపై వరుస దాడులు.. తాజాగా మరో రెండు చోట్ల..!

ఏపీలోని చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వరస దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న శ్రీకాళహస్తిలో వాలంటీర్లపై టీటీడీ కార్యకర్తలు దాడికి పాల్పడగా, ఈ రోజు పలమనేరు, కలకడ మండలాల్లో వాలంటీర్లపై దాడులు జరిగాయి.

ఏపీలో వాలంటీర్లపై వరుస దాడులు.. తాజాగా మరో రెండు చోట్ల..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 2:44 PM

ఏపీలోని చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వరస దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న శ్రీకాళహస్తిలో వాలంటీర్లపై టీటీడీ కార్యకర్తలు దాడికి పాల్పడగా, ఈ రోజు పలమనేరు, కలకడ మండలాల్లో వాలంటీర్లపై దాడులు జరిగాయి. పలమనేరు మున్సిపాలిటీలో వాలంటీర్ సౌమ్యపై వైసీపీ మండల కార్యదర్శి సావిత్రమ్మ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన ఆదేశాలను, మాటలను ఖాతరు చేయలేదని సౌమ్యపై సావిత్రమ్మ చేయి చేసుకున్నారు. మాట వినకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ బెదిరించినట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారులు, పోలీసులకు సౌమ్య ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరోవైపు కలకడ మండలంలోనూ వాలంటీర్‌పై దాడి జరిగింది. నవాబుపేట గ్రామ సచివాలయ వాలంటీర్‌గా పనిచేస్తున్న జ్యోష్న, ఆమె కుటుంబంపై కొందరు దాడి చేశారు. గ్రామంలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడం లేదని జ్యోష్న ప్రశ్నించడంతో ఆమెతో పాటు కుటుంబంపై శంకర్ నాయుడు, అతడి అనుచరులు కర్రలు, రాళ్లతో దాడులు జరిపారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో కలకడ పోలీస్ స్టేషన్‌లో శంకర్ నాయుడు, అనుచరులపై జ్యోష్న ఫిర్యాదు చేశారు. కాగా  ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న ఉద్దేశ్యంతో అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: గుడ్ న్యూస్: టీటీడీ కళ్యాణ మండపాల్లో.. శ్రీవారి లడ్డూ ప్రసాదం..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..