భగ్గుమన్న పాతకక్షలు.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై వేటకొడవళ్లతో దాడి
కర్నూల్ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. తిక్కారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మంత్రాలయం మండలం కగ్గల్లు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తిక్కారెడ్డి ఈ ఉదయం అక్కడకు వెళ్లారు. గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బాలనాగిరెడ్డి అనుచరులు తిక్కారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్న సమయంలో ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ […]
కర్నూల్ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. తిక్కారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
మంత్రాలయం మండలం కగ్గల్లు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తిక్కారెడ్డి ఈ ఉదయం అక్కడకు వెళ్లారు. గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బాలనాగిరెడ్డి అనుచరులు తిక్కారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్న సమయంలో ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడిలో తిక్కారెడ్డికి తీవ్రగాయాలు కాగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సై సహా పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కగ్గల్లు సహా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.