పట్టాలు తప్పిన ఎక్సప్రెస్.. ఐదుగురు మృతి
బంగ్లాదేశ్లో ఘోర ట్రైన్ ప్రమాదం జరిగింది. కులౌరా ఉపాజిలాలోని బరాంచల్ వద్ద ఉప్బన్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రమాదంలో నాలుగు బోగిలు బ్రిడ్జ్పై నుంచి పడిపోయాయి. ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. 250 మందికి పైగా గాయపడ్డారు. వంతెన దాడుతుండగా ట్రైన్ పట్టాలు తప్పటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు బోగీలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. […]
బంగ్లాదేశ్లో ఘోర ట్రైన్ ప్రమాదం జరిగింది. కులౌరా ఉపాజిలాలోని బరాంచల్ వద్ద ఉప్బన్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రమాదంలో నాలుగు బోగిలు బ్రిడ్జ్పై నుంచి పడిపోయాయి. ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. 250 మందికి పైగా గాయపడ్డారు.
వంతెన దాడుతుండగా ట్రైన్ పట్టాలు తప్పటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు బోగీలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీలోని ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను స్థాని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.