టెర్రర్ యాక్సిడెంట్: బస్సు, టెంపో ఢీ.. 11 మంది మృతి
అసోంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్హెచ్-37 రహదారిపై ఓ టెంపో, బస్సు ఢీ కొనడంతో 11 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలోని శివసాగర్ జిల్లా దెమోలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగంతో వచ్చిన బస్సును టెంపోను ఢీ కొనడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు […]
అసోంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్హెచ్-37 రహదారిపై ఓ టెంపో, బస్సు ఢీ కొనడంతో 11 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలోని శివసాగర్ జిల్లా దెమోలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగంతో వచ్చిన బస్సును టెంపోను ఢీ కొనడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఘటనలో టెంపోలో ఉన్నవారే మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు టెంపో వాహనం నుజ్జునుజ్జయింది. వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను అధికారులు గంటల తరబడి శ్రమించి బయటకు తీశారు.