ఆ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టిన సమంత..!
పెళ్లైన తరువాత సమంత సెలక్టివ్గా కథలను ఎంచుకుంటోంది. ముఖ్యంగా ఇంతవరకు చేసిన పాత్రలకు భిన్నంగా స్టోరీలను ఓకే చెప్తుంది.
Samantha Akkineni movie: పెళ్లైన తరువాత సమంత సెలక్టివ్గా కథలను ఎంచుకుంటోంది. ముఖ్యంగా ఇంతవరకు చేసిన పాత్రలకు భిన్నంగా స్టోరీలను ఓకే చెప్తుంది. ఈ క్రమంలో కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్లో నటించేందుకు సమంత అప్పట్లో ఓకే చెప్పింది. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. లాక్డౌన్ లేకపోయి ఉంటే ఈ మూవీ ఈపాటికే ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేది. అదంతా పక్కనపెడితే ఈ మూవీ ఆగిపోయినట్లు ఇప్పుడు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీని సమంత హోల్డ్లో పెట్టిందట. ఇటీవల అనుష్క నటించిన నిశ్శబ్దం ఓటీటీలో విడుదల కాగా.. దానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఇక అశ్విన్ దర్శకత్వంలో సమంత నటించాల్సిన మూవీ పాత్ర కూడా ఇంచుమించు అలాంటిదేనట. ఈ నేపథ్యంలో నిశ్శబ్దం ఫలితంతో ఆమె ఈ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టినట్లు సమాచారం. దీంతో చేసేదేం లేక అశ్విన్ మరో కథను తాప్సీకి వినిపించినట్లు తెలుస్తోంది. తాప్సీ, అశ్విన్ కాంబోలో ఇదివరకు గేమ్ ఓవర్ రాగా అది మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం.
Read More: