సంచయితపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అశోక్ గజపతిరాజు.. తండ్రి, తాతను కూడా కలవలేదంటూ విమర్శలు..!
గజపతిరాజుల కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్నాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ బాధ్యతలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాల బాధ్యతను..
Ashok Gajapathi Raju Comments: గజపతిరాజుల కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్నాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ బాధ్యతలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాల బాధ్యతను కూడా ఏపీ ప్రభుత్వం సంచయితకు అప్పగించడంపై అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్టుపై ఆయన ధ్వజమెత్తారు.
‘చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ సంచయితను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్ట్ చేశారు. మీరు చేస్తున్న పోస్టులు.. మీ వ్యవహారశైలికి అడ్డం పడుతున్నాయి. ఎవరో పెట్టిన పోస్టులకు తాను సమాధానం చెప్పాల్సి రావడం తన ఖర్మ’ అని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
మాన్నాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి ఆనవాయితీగా వచ్చేది. అలాకాదని కోర్టు తీర్పులకు, ఆనవాయితీలకు విరుధ్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇష్టమొచ్చిన వారిని కుటుంబసభ్యులని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తండ్రి, తాతను కూడా ఎప్పడూ సంచయిత కలవలేదని అశోక్ గజపతి రాజు దుయ్యబట్టారు.
Also Read:
కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!
ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ.!