దయచేసి బాణాసంచా కాల్చకండి : ప్రజలకు కేజ్రీవాల్ విన్నపం
కరోనా భూతం మళ్లీ జడలు విప్పుతోంది.. చలికాలంలో మరింతగా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు కూడా! ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీపావళి పండుగ సంబరాలు ఇంటిపట్టునే ఉండి జరుపుకోవాలని, లక్ష్మీ పూజలు కూడా ఇంట్లోనే చేసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు. వాయుకాలుష్యం పెరుగుతుండటంతో బాణాసంచా కూడా కాల్చవద్దని విన్నవించుకున్నారు. పెరుగుతోన్న కరోనా కేసులను కూడా మనుసులో పెట్టుకుని మసలుకోవాలని తెలిపారు. తనతో పాటు తన […]
కరోనా భూతం మళ్లీ జడలు విప్పుతోంది.. చలికాలంలో మరింతగా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు కూడా! ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీపావళి పండుగ సంబరాలు ఇంటిపట్టునే ఉండి జరుపుకోవాలని, లక్ష్మీ పూజలు కూడా ఇంట్లోనే చేసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు. వాయుకాలుష్యం పెరుగుతుండటంతో బాణాసంచా కూడా కాల్చవద్దని విన్నవించుకున్నారు. పెరుగుతోన్న కరోనా కేసులను కూడా మనుసులో పెట్టుకుని మసలుకోవాలని తెలిపారు. తనతో పాటు తన కేబినెట్ కూడా ఇంట్లోనే దీపావళి పూజలు చేసుకుంటున్నట్టు చెప్పారు.. నవంబర్ 14 రాత్రి సరిగ్గా 7.39 గంటలకు తన మంత్రిమండలితో కలిసి లక్ష్మీ పూజ చేస్తామన్నారు కేజ్రీవాల్.. కరోనా పీడ లేకుంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా దీపావళిని గ్రాండ్గా సెలెబ్రెట్ చేసేది.. లాస్టియర్ కన్నాట్ ప్లేస్లో లేజర్ షో నిర్వహించిన ఢిల్లీ ప్రభుత్వం ఈసారి వేడుకలకు దూరంగా ఉంటోంది. అయితేనేం దీపావళిని తాము ఘనంగా జరుపుకుంటామని చెబుతున్నారు కేజ్రీవాల్.. రెండు కోట్ల మంది ప్రజలు ఇంటిదగ్గరే వైభవోపేతంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తారని, ఇంతకంటే ఏం కావాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చబోమని తెలిపారు.