11 ఏళ్ల తర్వాత బాలీవుడ్కి ‘అరుంధతి’?
అనుష్క అలియాస్ స్వీటీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచిన అరుంధతి. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారని టాక్. ఇప్పటికే శ్యామ్ ప్రసాద్ రెడ్డి నుంచి ఈ సినిమా రీమేక్ హక్కులను కొన్నారట. ఈ రీమేక్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుందని..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీమేక్ల ట్రెండ్ కొనసాగుతోందన్న విషయం తెలిసిందే. వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను మాతృభాషలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను టాలీవుడ్ సినిమాలపై పడింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయి, బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన పలు హీరోల చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి, జెర్సీ, హిట్, ఇస్మార్ట్ శంకర్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి పలు సినిమాలు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్లోకి మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చి చేరింది.
అదే సినిమా అంటే.. అనుష్క అలియాస్ స్వీటీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచిన ‘అరుంధతి’. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారని పలు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శ్యామ్ ప్రసాద్ రెడ్డి నుంచి ఈ సినిమా రీమేక్ హక్కులను కొన్నారట. ఈ రీమేక్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుందని భోగట్టా. అయితే ఈ రీమేక్ విషయంలో ఇప్పటివరకూ అల్లు అరవింద్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
కాగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్మకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో అద్భుతంగా నటించి, ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా దక్కించుకుంది అనుష్క. ఈ చిత్రం స్వీటీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
Read More: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం.. విపరీతంగా కేసులు నమోదు..