అరుణాచల్‌ డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు

ఇటానగర్‌ : స్థానికేతరులకు రాష్ట్రప్రభుత్వం శాశ్వత పర్మనెంట్ రెసిడెంట్ ధృవీకరణ పత్రాలు మంజూరు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతుండటంతో అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడురోజులుగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకారులు ఇటానగర్‌లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌ బంగ్లాను తగులబెట్టారు. దీంతో ఆయన అక్కడ నుంచి ఆదివారం ఉదయం నామ్‌సాయ్‌ జిల్లాకు మకాం మార్చారు. దీంతోపాటుగా జిల్లా కమిషనర్‌ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. మరో ఎస్పీ ర్యాంకుస్థాయి అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. […]

అరుణాచల్‌ డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:05 PM

ఇటానగర్‌ : స్థానికేతరులకు రాష్ట్రప్రభుత్వం శాశ్వత పర్మనెంట్ రెసిడెంట్ ధృవీకరణ పత్రాలు మంజూరు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతుండటంతో అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడురోజులుగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకారులు ఇటానగర్‌లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌ బంగ్లాను తగులబెట్టారు. దీంతో ఆయన అక్కడ నుంచి ఆదివారం ఉదయం నామ్‌సాయ్‌ జిల్లాకు మకాం మార్చారు. దీంతోపాటుగా జిల్లా కమిషనర్‌ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. మరో ఎస్పీ ర్యాంకుస్థాయి అధికారి తీవ్రంగా గాయపడ్డాడు.

రాష్ట్రప్రభుత్వం నియమించిన ఓ కమిటీ అరుణాచల్‌ప్రదేశ్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న స్థానికేతర కుటుంబాలకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సిందిగా సిఫారసు చేసింది. దీంతో శుక్రవారం నుంచి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందడం పరిస్థితులు మరింతగా అదుపుతప్పడానికి కారణమైంది. నిరసనకారులు దాదాపు 50కార్లకు నిప్పంటించారు. 100కు పైగా వాహనాలను ధ్వంసం చేశారు. ఇటానగర్‌లో అయిదు థియేటర్లను తగులబెట్టారు. నాగాలాండ్‌ నుంచి వచ్చిన ఓ మ్యూజిక్‌బ్యాండ్‌ బృందంపైనా దాడిచేసి, సంగీతపరికరాలు, వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. రాజధాని వీధుల్లో కవాతు నిర్వహించాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ముఖ్యమంత్రి పెమా ఖండూతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఇటానగర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూ విధించారు.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..