జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ దళాల కాల్పులు, భారత ఆర్మీ జవాను మృతి, మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన
జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వద్ద గురువారం పాకిస్థాన్ దళాలు జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ జవాను ఒకరు మృతి చెందారు.
జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వద్ద గురువారం పాకిస్థాన్ దళాలు జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ జవాను ఒకరు మృతి చెందారు. ఈయనను జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ కి చెందిన హవల్దార్ నిర్మల్ సింగ్ గా గుర్తించారు. పూంఛ్ జిల్లాలోని కృష్ణఘాటీ సెక్టార్లో పాక్ సేనలు కాల్పుల విరమణను అతిక్రమించి హఠాత్తుగా ఫైర్ చేసినట్టు సైనికవర్గాలు తెలిపాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిర్మల్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. గత రెండేళ్లలో భారత-పాక్ సరిహద్దుల్లో పాక్ పలుమార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. గత ఏడాది మొత్తం 4.700 సార్లు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. గత 17 ఏళ్లలో ఇన్నిసార్లు అతిక్రమణ జరగడం ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు. ఇన్నిసార్లు పాక్ తెగబడుతున్నా భారత విదేశాంగ విధానంలో మార్పు రావడంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి. దీన్నొక సాధారణ ఘటనగా పరిగణించి… విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించడం లేదన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. Read Also:పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన, భారత్ సీరియస్, దౌత్యాధికారికి సమన్లు జారీ. Read Also:వృధ్ద రైతును సీఆర్పీఎఫ్ జవాను లాఠీతో కొట్టాడా ? లేదా ? వైరల్ అవుతున్న వీడియో , ఏది నిజం ?