జనగామను వీడని కరోనా..జవాన్కు పాజిటివ్
జనగామ జిల్లాను కరోనా వీడటం లేదు. తాజాగా జిల్లాకు చెందిన ఓ జవానుకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
జనగామ జిల్లాను కరోనా వీడటం లేదు. ఇటీవలే జనగామలో వైరస్ లక్షణాలు ఉన్నవారందరినీ క్వారంటైన్ నుంచి డిశార్చ్ చేసి..హోం క్వారంటైన్లో ఉంచారు. ప్రస్తుతం పాజిటివ్ కేసులు లేనందువల్ల జిల్లాలో కాస్తా ఊరట కలిగింది. అయితే, తాజాగా జనగామ జిల్లాకు చెందిన ఓ జవానుకు కూడా వైరస్ సోకినట్లు సమాచారరం. వివరాల్లోకి వెళితే…
జనగామ జిల్లాలో ఆర్మీ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామానికి చెందిన ఈ జవాన్కు వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు మూడు రోజుల క్రితం ఆర్మీ ఉద్యోగి నుంచి శాంపిల్ తీసుకొని వెళ్లారు. దాని ఫలితం గురువారం వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకొని కరోనా సోకిన వ్యక్తిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడి వైరస్ ఎలా సోకిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న ఇతను(కరోనా బాధితుడు) గత కొంత కాలం క్రితమే ఢిల్లీ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. నెల రోజుల క్రితం కరీంనగర్లో పర్యటించిన పది మంది ఇండోనేసియన్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వారు రామగుండానికి వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులోనే ఈ జవాను కూడా వచ్చినట్లుగా సమాచారం. అయితే, ఈ పరిణామం జరిగి నెల రోజులుగడిచిపోయింది. ఈ వ్యక్తికి తాజాగా కరోనా లక్షణాలు బయట పడడంతో అందరిలోనూ మరింత ఆందోళన కలిగిస్తోంది.