ఆర్మీ చీఫ్ కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం
న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం వరించింది. దేశ రాజధాని ఢిల్లీలో కీర్తిచక్ర, శౌర్యచక్ర, పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా జరిగింది. భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందజేశారు. ఆర్మీ జవాన్ వ్రహ్మపాల్ సింగ్, సీఆర్పీఎఫ్ జవాన్లు రాజేంద్ర నైన్, రవీంద్ర బబ్బన్, మేజర్ తుషార్ గౌబలకు […]
న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం వరించింది. దేశ రాజధాని ఢిల్లీలో కీర్తిచక్ర, శౌర్యచక్ర, పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా జరిగింది. భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందజేశారు. ఆర్మీ జవాన్ వ్రహ్మపాల్ సింగ్, సీఆర్పీఎఫ్ జవాన్లు రాజేంద్ర నైన్, రవీంద్ర బబ్బన్, మేజర్ తుషార్ గౌబలకు కీర్తి చక్ర పురస్కారాలు వరించాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్కు చెందిన 12 మంది అధికారులు, జవాన్లు శౌర్యచక్ర పురస్కారాలు అందుకున్నారు.