అణ్వాయుధాల వినియోగంపై ఆర్మీ చీఫ్ సెన్సషనల్ కామెంట్స్

పాకిస్తాన్ తో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ యుద్ధ రంకెలు వేస్తున్న సమయంలో రావత్ కామెంట్స్ సెన్సషనల్ అయ్యాయి. ముందుగా అణ్వాయుధం వాడబోమన్న ఒప్పందానికి భారత్ పక్కన పెట్టేసింది, అవసరమైతే అణ్వాయుధాన్ని ముందుగా కూడా ప్రయోగిస్తామన్నాయి రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల చేసిన కామెంట్స్ తో బిపిన్ రావత్ విభేదించారు. పాక్ తో యుద్ధం వస్తే ముందుగా అణ్వాయుధాలు […]

అణ్వాయుధాల వినియోగంపై ఆర్మీ చీఫ్ సెన్సషనల్ కామెంట్స్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 30, 2019 | 12:22 PM

పాకిస్తాన్ తో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ యుద్ధ రంకెలు వేస్తున్న సమయంలో రావత్ కామెంట్స్ సెన్సషనల్ అయ్యాయి. ముందుగా అణ్వాయుధం వాడబోమన్న ఒప్పందానికి భారత్ పక్కన పెట్టేసింది, అవసరమైతే అణ్వాయుధాన్ని ముందుగా కూడా ప్రయోగిస్తామన్నాయి రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల చేసిన కామెంట్స్ తో బిపిన్ రావత్ విభేదించారు.

పాక్ తో యుద్ధం వస్తే ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించమని బిపిన్ రావత్ తేల్చి చెప్పారు. భూ, వాయు మార్గాల ద్వారా యుద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో పాక్ దాగుడుమూతలు ఆడుతోందని, పాక్ కవ్వింపు చర్యలు ఎల్లకాలం సాగవని ఆయన పేర్కొన్నారు. పాక్ భారత్ తో యుద్ధం కోరుకుంటున్నట్టు వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. కశ్మీరీలు పవిత్ర యుద్ధం (జిహాద్) చేస్తున్నారని, వారికి పాక్ అండగా ఉంటే , వారు విజయం సాధించడం తథ్యమని ఆదివారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ భగ్గుమన్నారు. భారత్ తో యుద్ధానికి దిగితే పాక్ కు గట్టి గుణపాఠం చెబుతామని రావత్ హెచ్చరించారు. మెరుపుదాడులతో భారత్ సత్తా ఏమిటో ఇప్పటికే పాక్ కు తెలిసివచ్చిందని ఆయన పేర్కొన్నారు. భారత అంతర్గత వ్యవహారాల్లో పాక్ జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.