క్రైమ్ డ్రామా నేపథ్యంలో సందీప్ రెడ్డి బాలీవుడ్ మూవీ! 

అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఓ క్రైమ్ డ్రామాతో కూడిన సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో తాను ప్యాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటున్నానని, ఇది క్రైమ్ డ్రామా నేపథ్యంలోని కథ అని, అయితే అందులో ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో ఇంకా […]

క్రైమ్ డ్రామా నేపథ్యంలో సందీప్ రెడ్డి బాలీవుడ్ మూవీ! 
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2019 | 9:35 PM

అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఓ క్రైమ్ డ్రామాతో కూడిన సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో తాను ప్యాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటున్నానని, ఇది క్రైమ్ డ్రామా నేపథ్యంలోని కథ అని, అయితే అందులో ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మరికొన్ని రోజుల్లో ప్రకటించబోతున్నట్లు సందీప్ రెడ్డి వెల్లడించారు.

మంచి కంటెంట్ ఉంటే సౌత్ సినిమాలు హిందీలో కూడా బాగా ఆడతాయి అని బాహుబలి, కెజిఎఫ్ లాంటి చిత్రాలు ప్రూవ్ చేశాయని ఈ సందర్భంగా సందీప్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో ఈ యంగ్ డైరెక్టర్.. మహేష్ బాబును కలిసి కథ చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై సరైన క్లారిటీ లేదు.

‘సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన తొలి బాలీవుడ్ మూవీ ‘కబీర్ సింగ్’ వివరాల్లోకి వెళితే… షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈచిత్రం జూన్ 21న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.