ఇక నుంచి ఏపీలోని బస్టాండులు, బస్ డిపోల్లో పెట్రోల్ బంక్లు..!
బస్టాండులు, బస్ డిపోల ప్రాంగణాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దీనితో ఏపీఎస్ఆర్టీసీ మొదటిగా జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో ప్రధానంగా..
కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్టీసీని మళ్లీ లాభాల బాటలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే బస్టాండులు, బస్ డిపోల ప్రాంగణాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దీనితో ఏపీఎస్ఆర్టీసీ మొదటిగా జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో ప్రధానంగా ఉన్న 90 బస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
అయితే వీటిని ఆర్టీసీ సొంతంగా నడిపించాలా లేదంటే పెట్రోలియం సంస్థలకు లీజుకు ఇవ్వాలా అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనపై సాధ్యాసాధ్యాలను అధికారులు పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో గత మూడు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వచ్చే అవకాశముంది.
కాగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండుల సమీపంలో పెట్రోల్ బంకులు లేవన్న సంగతి తెలిసిందే. దీని బట్టి ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం బస్టాండ్లలో బంకులు ఏర్పాటు అయితే కాంట్రాక్టు పద్దతిలో నడుపుతున్న బస్సులు కూడా ఇక్కడే ఇంధనం నింపుకునే అవకాశం ఉంటుంది. దీనితో ఆర్టీసీకి అదనపు ఆదాయం కూడా వస్తుంది.
ఇది చదవండి: కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!