‘జగన్ ఇచ్చిన హామీని’ నిలబెట్టుకోవాలి..!
ఏపీలో ఆర్టీసీ సమ్మెకు రెడీ అవుతున్నారు జేఏసీ సంఘాల నేతలు. సమ్మెకు తధ్యమంటూ సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్లను సైతం రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని చెబుతున్న నేతలు, తాము చేస్తున్న సమ్మె ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదని అంటున్నారు. వచ్చేనెల 13 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఏపీ ఆర్టీసీ నేతలు. సమ్మెలో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలకు పిలుపు ఇచ్చారు. […]
ఏపీలో ఆర్టీసీ సమ్మెకు రెడీ అవుతున్నారు జేఏసీ సంఘాల నేతలు. సమ్మెకు తధ్యమంటూ సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్లను సైతం రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని చెబుతున్న నేతలు, తాము చేస్తున్న సమ్మె ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదని అంటున్నారు.
వచ్చేనెల 13 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఏపీ ఆర్టీసీ నేతలు. సమ్మెలో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలకు పిలుపు ఇచ్చారు. సమ్మె ఎందుకు చేస్తున్నామో వివరిస్తూ.. ఇవాళ విజయవాడలో పోస్టర్లు విడదుల చేశారు జేఏసీ నేతలు. జూన్ 12 నుంచి దూరప్రాంతాల సర్వీసులను నిలిపివేస్తామని అంటున్నారు. సిబ్బంది కుదింపుపై యాజమాన్యం తన వైఖరిని మార్చుకోవాలని అంటున్నారు.
ఆర్టీసీ సమస్యలపై కొత్త ప్రభుత్వం స్పందించాలని చెబుతున్న జేఏసీ నేతలు.. ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టాలని అంటున్నారు. మిగతా రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు.