ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్…30శాతం పాఠ్యాంశాల కుదింపు..!
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ సంవత్సరం ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ సంవత్సరం ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. ఈ మేరకు ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకూ అకడమిక్ ఇయర్ ఉండేలా సమాలోచనలు చేస్తున్నారు. దీంతో మొత్తం 180 వర్కింగ్ డేస్ ఉండనున్నాయి. దాదాపు 30శాతం పాఠ్యాంశాల తగ్గింపునకు నిర్ణయం తీసుకోవడంతో…. వర్కింగ్ డేస్ తగ్గినా విద్యార్థులపై ఒత్తిడి ఉండదని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది పండగ సెలవులు కూడా తగ్గించనున్నారు. ఎగ్జామ్స్ షెడ్యూల్ మారనుంది.
స్కూల్స్ వర్క్ చేసే 180 రోజుల్లో పరిస్థితులు కుదుటపడేదాకా… దూరదర్శన్, ఆన్లైన్, మన టీవీ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాతే ఎప్పటిలాగా స్కూళ్లలోనే తరగతులు ఉండనున్నాయి. ఇప్పటికే సప్తగిరి ఛానల్ ద్వారా 1 నుంచి 5 తరగతులకు బ్రిడ్జి కోర్సు.. 6 నుంచి 10 స్టూటెంట్స్ కు పాఠాలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని కొనసాగించడంతో పాటు అదనంగా మన టీవీ ద్వారానూ పాఠాలు ప్రసారం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక టెన్త్ ఎగ్జామ్స్ మార్చి నుంచి ఏప్రిల్కు మార్పు చేయడం.. మే తొలి వారంలో 6 నుంచి 9 తరగతుల వారికి ఎగ్జామ్స్ నిర్వహించేలా కేలండర్ సిద్దం చేస్తున్నారు. 2021లో మే రెండోవారం నుంచి జూన్ 12 వరకూ వేసవి సెలవులిచ్చి వచ్చే విద్యా సంవత్సరం ఎలాంటి మార్పుల్లేకుండా ప్రారంభించే దిశగా ప్లానింగ్ జరుగుతుంది.