సరికొత్త వేరియేషన్లో వైర్లెస్ హెడ్ఫోన్స్.. తొలిసారిగా మర్కెట్లోకి విడుదల చేసిన యాపిల్ కంపెనీ..
ఐఫోన్ల దిగ్గజం యాపిల్ కంపెనీకి ఉండే క్రేజీయే వేరు. కొత్త మోడల్ మార్కెట్లో విడుదల చేసిందంటే చాలు వినియోగదారులు క్యూ
ఐఫోన్ల దిగ్గజం యాపిల్ కంపెనీకి ఉండే క్రేజీయే వేరు. కొత్త మోడల్ మార్కెట్లో విడుదల చేసిందంటే చాలు వినియోగదారులు క్యూ కట్టాల్సిందే. తాజాగా ఈ కంపెనీ మొదటిసారిగా వైర్లెస్ హెడ్ఫోన్స్ను రిలీజ్ చేసింది. ఎయిర్ పోడ్స్ మ్యాక్స్ పేరుతో దేశీయంగా విడుదల చేసింది.
యాపిల్ వెబ్సైట్, ఆధీకృత రిటైలర్ల ద్వారా వీటిని విక్రయించనుంది. స్థానికంగా వీటి ధర రూ. 59,900గా ప్రకటించింది. ఈ నెల 15 నుంచి వీటిని సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. తాజా అమ్మకాలలో భాగంగా 25 దేశాలు, ప్రాంతాలకు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. ఐప్యాడ్లు తదితర యాపిల్ డివైస్లు ఐవోఎస్ 14.3 లేదా తదుపరి అప్గ్రేడ్తో పనిచేస్తాయని ఐఫోన్ల దిగ్గజం పేర్కొంది. ఈ సందర్భంగా యాపిల్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ గ్రెగ్ జాస్వియక్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా హెడ్ఫోన్స్లో ఎయిర్పోడ్స్ జనాదరణ పొందినట్లు పేర్కొన్నారు. ఎయిర్పోడ్స్ మ్యాక్స్ ద్వారా అత్యంత నాణ్యతమైన ఆడియో ఎక్స్పీరియన్స్ను పొందవచ్చని తెలియజేశారు. ఆధునిక డిజైన్, ప్రతిభావంతమైన హెచ్1 చిప్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తదితరాల కారణంగా వినియోగదారులు అత్యుత్తమ వైర్లెస్ ఆడియోను ఆనందించవచ్చని వివరించారు. ఎడాప్టివ్ ఈక్విలైజర్ కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మూడు మైక్రోఫోన్ల ద్వారా అనవసర శబ్దాలను తగ్గిస్తుందని(నాయిస్ రిడక్షన్) పేర్కొన్నారు. కాగా దీని ధర మాత్రం ఎక్కువైందని కొంతమంది వినియోగదారులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు.