యాపిల్ సంస్థ నుంచి న్యూ మ్యాక్బుక్.. ఫీచర్స్ ఇవే!
గ్యాడ్జెట్ దిగ్గజం యాపిల్ మరో సరికొత్తగా 13 అంగుళాల న్యూ మ్యాక్బుక్ని ఆవిష్కరించింది. ఇందులో రెటీనా తెర, ఎస్కేప్కీ, టచ్ బార్, టచ్ ఐడీ, డబుల్ స్టోరేజీ, మ్యాజిక్ కీబోర్డు వంటి అనేక ఫీచర్లు అందిస్తోంది. ఈ మ్యాక్డుక్లో అధునాతనమైన టెన్త్ జనరేషన్..
గ్యాడ్జెట్ దిగ్గజం యాపిల్ మరో సరికొత్తగా 13 అంగుళాల న్యూ మ్యాక్బుక్ని ఆవిష్కరించింది. ఇందులో రెటీనా తెర, ఎస్కేప్కీ, టచ్ బార్, టచ్ ఐడీ, డబుల్ స్టోరేజీ, మ్యాజిక్ కీబోర్డు వంటి అనేక ఫీచర్లు అందిస్తోంది. ఈ మ్యాక్డుక్లో అధునాతనమైన టెన్త్ జనరేషన్ ప్రాసెసర్లను ఉపయోగించింది యాపిల్ సంస్థ. అలాగే ఇందులో 4.1 గిగా హెట్జ్ టర్బో బూస్ట్ స్పీడ్ ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్లను వాడింది. అంతేకాకుండా 80 శాతం వేగవంతమైన గ్రాఫిక్స్తో పాటు 3733 మెగా హెట్జ్ సామర్థ్యం కలిగిన 16 జీబీ స్టోరేజీని అందిస్తోంది.
ఇక వినియోగదారులకు మంచి టైపింగ్ అనుభవం కల్పించేందుకు మ్యాజిక్ కీబోర్డును తీసుకొచ్చామని మ్యాక్, ఐప్యాడ్ ఉత్పత్తుల మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ టామ్ బోజర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిజర్ మెకానిజంతో తయారైన ఈ 1 మి.మి కీతో వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆరో కీల కోసం కొత్త ఇన్వర్టెట్ ‘టి’ అమెరికను అందించామన్నారు. దీనివల్ల ఈ కీలను తొందరగా గుర్తించవచ్చన్నారు టామ్ బోజర్.
అలాగే ఈ మ్యాక్బుక్లో డబుల్ స్టోరేజీ చేసుకునే సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించి 4 టీబీ ఎస్ఎస్డీకి అప్గ్రేడ్ చేశారు. అయితే భారత్లో దీని రేటు రూ.1,22,990గా యాపిల్ సంస్థ నిర్ణయించింది.
Read More:
మీ అకౌంట్లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి!
హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసుపై శ్రీముఖి రియాక్షన్
హైదరాబాద్లో మరిన్ని కఠిన ఆంక్షలు.. అధికారులకు సీఎం దిశానిర్ధేశం