ఏపీలో గ్యాంగ్ వార్స్..ప‌లు జిల్లాల్లో ఘ‌ర్ష‌న‌లు..

ఏపీలో ఫ్యాక్ష‌న్ పగ‌లు భ‌గ్గుమ‌న్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చిన్న పూజర్ల గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణ జ‌రిగింది. రాళ్లు కర్రలతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. ఈ గొడ‌వ‌లో బ్రహ్మ నాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రతిగా ప్రత్యర్థి వర్గం దాడులకు తెగ‌బ‌డ‌టంతో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక‌ కృష్ణాజిల్లా చందర్లపాడు (మం) తోటరావుపాడులో ఘర్షణ చెల‌రేగింది. అలగ్జాండర్ అనే వ్యక్తి పై విజయ్ కుమార్ అనే మ‌రో వ్య‌క్తి కత్తితో దాడి […]

ఏపీలో గ్యాంగ్ వార్స్..ప‌లు జిల్లాల్లో ఘ‌ర్ష‌న‌లు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 8:33 PM

ఏపీలో ఫ్యాక్ష‌న్ పగ‌లు భ‌గ్గుమ‌న్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చిన్న పూజర్ల గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణ జ‌రిగింది. రాళ్లు కర్రలతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. ఈ గొడ‌వ‌లో బ్రహ్మ నాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రతిగా ప్రత్యర్థి వర్గం దాడులకు తెగ‌బ‌డ‌టంతో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇక‌ కృష్ణాజిల్లా చందర్లపాడు (మం) తోటరావుపాడులో ఘర్షణ చెల‌రేగింది. అలగ్జాండర్ అనే వ్యక్తి పై విజయ్ కుమార్ అనే మ‌రో వ్య‌క్తి కత్తితో దాడి చేసి గాయ‌ప‌ర్చాడు. విజ‌య్ కుమార్ కు తీవ్ర గాయాలు పాల‌వ‌డంతో…అతడిని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పాత కక్ష్యల నేపధ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చెప్తున్న గ్రామస్థులు చెప్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో ఆస్థి త‌గాదాలు నేప‌థ్యంలో ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఓ ఇంటిపై ప్రత్యర్ధులు రాళ్ళు రువ్వ‌డంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.