ఏపీలో ఇవాళ ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వం తీవ్రంగా కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికి కేసుల సంఖ్య పెరుగుదల ఆగడం లేదు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 348కి చేరింది. ఇవాళ ఒక్కరోజే మొత్తం 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 7, నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదు కాగా… […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వం తీవ్రంగా కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికి కేసుల సంఖ్య పెరుగుదల ఆగడం లేదు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 348కి చేరింది. ఇవాళ ఒక్కరోజే మొత్తం 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 7, నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదు కాగా… పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో నలుగురు మృతి చెందగా… ఆరుగురు కోలుకున్నారు.