ఏపీ: ఎంసెట్ రాయని విద్యార్థులకు గుడ్ న్యూస్.!
AP Eamcet 2020: కరోనా కారణంగా ఎంసెట్ పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో పరీక్షను నిర్వహిస్తామని ఏపీ ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని ఆయన అన్నారు. ఎంసెట్ పరీక్ష రాయని విద్యార్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా helpdeskeamcet2020@gmail.com మెయిల్కి తమ హాల్ టికెట్తో పాటు, కరోనా రిపోర్టులను పంపాలని సూచించింది. వీరికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. […]
AP Eamcet 2020: కరోనా కారణంగా ఎంసెట్ పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో పరీక్షను నిర్వహిస్తామని ఏపీ ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని ఆయన అన్నారు. ఎంసెట్ పరీక్ష రాయని విద్యార్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా helpdeskeamcet2020@gmail.com మెయిల్కి తమ హాల్ టికెట్తో పాటు, కరోనా రిపోర్టులను పంపాలని సూచించింది. వీరికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. కాగా, దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే 0884–2340535, 2356255 నెంబర్లకు ఫోన్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.రవీంద్ర అన్నారు.
Also Read:
నాలుగేళ్ల డిగ్రీ చేసినవారికి పీహెచ్డీ అడ్మిషన్లు..
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు.!
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..
బ్రూసెల్లోసిస్… తస్మాత్ జాగ్రత్త.!
రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. రూ. 35 వరకు పెరగనున్న టికెట్ ధర!