జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు..!

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదైంది. దివాకర్‌ ట్రావెల్స్‌ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు.

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు..!
Follow us

|

Updated on: Jun 06, 2020 | 5:44 PM

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదైంది. దివాకర్‌ ట్రావెల్స్‌ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ – 4 వాహనాలుగా మార్చిన లారీలను తమకు అమ్మారని వారు ఫిర్యాదులో పేర్కోన్నారు. లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ వారు ఆరోపించారు. కాగా, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బీఎస్‌-3 వాహనాలను అమ్మినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు లారీ ఓనర్ల ఆధ్వర్యంలో ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు.