ఏపీ : టెక్నాలజీ ఉపయోగించుకుని ఇసుక రీచ్ల రివ్యూ
రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టాలని మంత్రుల కమిటీ గనుల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టాలని మంత్రుల కమిటీ గనుల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఏపీలో ఇసుక లభ్యత పెంచేందుకు సర్కార్ కార్యాచరణ ప్రారంభించింది. నదుల్లో వరదలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఇసుక రీచ్లలో తవ్వకాలు చేపట్టాల్సిందిగా మంత్రుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ ఇవాళ మరోసారి భేటీ అయ్యింది. భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. అటు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇతర ఉన్నతాధికారులు ఈ మీటింగ్కు హాజరై మంత్రుల కమిటీకి ప్రస్తుత పరిస్థితిని నివేదించారు. ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీని మరింత మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ( ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు ! )
బ్లాక్ మార్కెట్లో ఇసుక విక్రయాలు నిలువరించటంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు చేశారు. టెక్నాలజీ ఉపయోగించుకుని ఇసుక రీచ్ల్లో కార్యకలాపాలను రివ్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లోనూ ఇసుక లభ్యతపై వినియోగదారులకు సమాచారం అందేలా చూడాలని సూచనలు చేశారు. ( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )