ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!
గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగానే పల్లెల్లోని ప్రజలందరూ కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని..
Mask Compulsory In Villages AP: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు లాక్ డౌన్ ఆంక్షలను విధించారు. అలాగే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఆదివారం నాడు పూర్తిస్థాయిలో కర్ఫ్యూను విధిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగానే పల్లెల్లోని ప్రజలందరూ కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని.. లేదంటే పంచాయితీ స్థాయిని బట్టి రూ. 10 నుంచి రూ. 50 వరకు జరిమానా విధించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు అధికారులను ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారో, లేదో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రతను పాటించడం వంటివి కరోనా నివారణా చర్యల్లో ముఖ్యమైనవి అని ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు స్పష్టం చేశారు.
Also Read:
గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్’.. కేవలం రూ. 35కే..
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!