మంత్రి ఫోర్జరీ సంతకం : ఇద్దరు పోలీసుల సస్పెన్షన్..!

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు చిక్కుల్లో పడ్డారు. ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగుల బదిలీ సిఫార్సు లెటర్లు తయారు చేసి.. వీరు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ స్కాం బయటపడటంతో ఇద్దరు కానిస్టేబుళ్లు వెంకట్ రెడ్డి, వేణుగోపాల్‌ను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. కాగా.. ఈ పోలీసులే కాక.. మరికొంతమంది ఉద్యోగులు కూడా అక్రమంగా బదిలీ ఉత్తర్వులతో ప్రయోజనాలు పొందారనే విషయం తెలియడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం […]

మంత్రి ఫోర్జరీ సంతకం : ఇద్దరు పోలీసుల సస్పెన్షన్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 17, 2019 | 12:38 PM

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు చిక్కుల్లో పడ్డారు. ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగుల బదిలీ సిఫార్సు లెటర్లు తయారు చేసి.. వీరు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ స్కాం బయటపడటంతో ఇద్దరు కానిస్టేబుళ్లు వెంకట్ రెడ్డి, వేణుగోపాల్‌ను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. కాగా.. ఈ పోలీసులే కాక.. మరికొంతమంది ఉద్యోగులు కూడా అక్రమంగా బదిలీ ఉత్తర్వులతో ప్రయోజనాలు పొందారనే విషయం తెలియడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. మంత్రి కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల హస్తం ఇందులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డికి తెలియదని తెలుస్తోంది.