కాలుష్య నియంత్రణ కార్యాలయానికి బాలినేని శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి క్షేత్రీయ, ప్రాంతీయ కార్యాలయానికి విజయవాడలో శంకుస్థాపన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రూ. 22 కోట్ల వ్యయంతో కూడిన ఈ భవన నిర్మాణ బాధ్యతలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించామని మంత్రి స్పష్టం చేశారు. 18 నెలల్లో భవనం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలలో కాలుష్య నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన దృష్టిలో పెట్టుకొని మరిన్ని […]

కాలుష్య నియంత్రణ కార్యాలయానికి బాలినేని శంకుస్థాపన
Follow us

|

Updated on: Oct 21, 2020 | 1:55 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి క్షేత్రీయ, ప్రాంతీయ కార్యాలయానికి విజయవాడలో శంకుస్థాపన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రూ. 22 కోట్ల వ్యయంతో కూడిన ఈ భవన నిర్మాణ బాధ్యతలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించామని మంత్రి స్పష్టం చేశారు. 18 నెలల్లో భవనం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలలో కాలుష్య నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన దృష్టిలో పెట్టుకొని మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు.