ఆయనను మనిషిగా కూడా చూడను: గంటాకు అవంతి కౌంటర్
మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నోరు తెరిస్తే గంటా బండారం బయటపడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. గంటాను తాను కనీసం మనిషిగా కూడా గుర్తించనని అన్నారు. అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతారని విమర్శించారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన అయ్యన్నకే గంటా శ్రీనివాసరావు సున్నం పెట్టారని.. ఆయన ఇంకా మంత్రిగానే ఉన్నట్లు భ్రమ పడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. తనకు కూడా గంటా సున్నం పుయ్యాలని […]
మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నోరు తెరిస్తే గంటా బండారం బయటపడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. గంటాను తాను కనీసం మనిషిగా కూడా గుర్తించనని అన్నారు. అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతారని విమర్శించారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన అయ్యన్నకే గంటా శ్రీనివాసరావు సున్నం పెట్టారని.. ఆయన ఇంకా మంత్రిగానే ఉన్నట్లు భ్రమ పడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. తనకు కూడా గంటా సున్నం పుయ్యాలని చూశారని.. అయితే తాను పూయించుకోలేదని పేర్కొన్నారు. అదృష్టం బాగుండి గంటా స్వల్ప మెజార్టీతో గెలిచారని చెప్పుకొచ్చారు. మంచివారిని వైసీపీ చేర్చుకుంటుందని, కబ్జాదారులను కాదు అంటూ అవంతి వ్యాఖ్యలు చేశారు.
అయితే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారన్న వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. ఈ క్రమంలో ఆ మధ్యన గంటాపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అవంతి. వాటిపై తాజాగా మాట్లాడిన గంటా.. తాను అవంతిని మంత్రిగా చూడటం లేదని.. వైసీపీలోకి వెళ్లాలనుకుంటే ఎవరూ ఆపలేరని.. పార్టీ మారాలనుకుంటే అందరితో చర్చించి వెళ్లానని.. చాటు మాటు వ్యవహారాలు చేయనని అన్నారు. ఎవరో తనను రెచ్చగొట్టాలని చూస్తే ఆ ట్రాప్లో తాను పడనని గంటా చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు అవంతి. తాను గంటాను మనిషిగా కూడా చూడనంటూ చెప్పుకొచ్చారు. కాగా.. గత కొన్ని రోజులుగా ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.