గీతం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు
విశాఖపట్టణంలో గీతం కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల వ్యవహారంలో సోమవారం వరకు తదుపరి చర్యలు నిలపాలని
Gitam University Campus: విశాఖపట్టణంలో గీతం కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల వ్యవహారంలో సోమవారం వరకు తదుపరి చర్యలు నిలపాలని న్యాయస్థానం ఆ ఆదేశాల్లో పేర్కొంది. కాగా గీతం కట్టడాల కూల్చివేతపై ఆ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ చర్యలను ఆపాలని హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా యూనివర్సిటీ నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారన్న ఆరోపించింది. నేడు దీనిపై న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.
Read More:
ఖరీదు కానుక ఇచ్చిన బంధువులు.. సంభ్రమాశ్చర్యాలకు గురైన కొత్త దంపతులు