ఏపీ డీజీపీపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. వెంకటరాజు అదృశ్యం విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే..
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. వెంకటరాజు అదృశ్యం విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందంటూ హైకోర్టు తెలిపింది. కాగా, అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీంతో బాధితుడి మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ కేసుపై విచారణ సందర్భంలో హైకోర్టు తీవ్ర అసహనానికి లోనైంది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందన్న హైకోర్టు.. ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ అమలు కావడం లేదని మండిపడింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో డీజీపీని పలుమార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదన్న హైకోర్టు.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదంటూ చురకలంటించింది.