అనుచిత వ్యాఖ్యలు.. మరో 44 మందికి హైకోర్టు నోటీసులు..!
హైకోర్టు, న్యాయవాదులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో 44 మందికి న్యాయస్థానం
హైకోర్టు, న్యాయవాదులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో 44 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్ ప్రభాకర్ సహా 44 మంది నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇవ్వడంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కార్యకర్తలు హైకోర్టుపై కామెంట్లు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో హైకోర్టు, న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇదే కేసులో రెండు రోజుల క్రితం 49 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేయగా.. తాజాగా మరో 44 మందికి నోటీసులు అందనున్నాయి. ఇక మరోవైపు ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Read This Story Also: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్పై చక్కర్లు కొడుతోన్న ఆసక్తికర వార్త..!