చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..ఏపీ హైకోర్టు నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ సందర్భంగా చంద్రబాబు తన ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించలేదని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్ ఏఎస్ విద్యాసాగర్ దాఖలుచేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ […]

చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..ఏపీ హైకోర్టు నోటీసులు!
Follow us

|

Updated on: Sep 29, 2019 | 12:32 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ సందర్భంగా చంద్రబాబు తన ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించలేదని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్ ఏఎస్ విద్యాసాగర్ దాఖలుచేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితోపాటు వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు.

ఇక కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, తదితరులకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో వంశీ సూచన మేరకు ఆయన మద్దతుదారులు ఇంటి స్థలాల నకిలీ పట్టాలను పంచి ప్రలోభ పెట్టారని తెలిపారు. లెక్కింపు కూడా చట్ట విరుద్ధంగా జరగడంతో తాను 990 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని ఆయన కోర్టుకు విన్నవించారు. మరి ఈ నోటిసులపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.