ఏపీ గ్రామ సచివాలయ పరీక్షల ప్రాథమిక కీ విడుదల
సెప్టెంబర్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాయ పరీక్ష ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. అభ్యర్థులకు ఏవైన అభ్యంతరాలు ఉంటే ఈ నెల 3లోపు చెప్పాలని పేర్కొంది.
సెప్టెంబర్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాయ పరీక్షల ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. అభ్యర్థులకు ఏవైన అభ్యంతరాలు ఉంటే ఈ నెల 3లోపు చెప్పాలని పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి సంబంధించిన ఎగ్జామ్స్ సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు నిర్వహించారు. పరీక్ష పూర్తివగానే ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని సెప్టెంబర్ 29న తెలపింది. తొందర్లోనే మరో కీని రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్ http://gramasachivalayam.ap.gov.inలో చూసుకోవచ్చని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫస్ట్ ఫేజ్ లో ఉద్యోగాల భర్తీ గతేడాది కంప్లీట్ అయ్యింది. అయితే కొందరు ఉద్యోగాల్లో చేరకపోవడం, ఉద్యోగాల్లో చేరినవారు మానెయ్యడంతో 16,208 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీ ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికే ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగా, ఫలితాల విడుదలవ్వాల్సి ఉంది. తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయి.
Also Read : పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్