మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాక్..
మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తూ జగన్ సర్కార్ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించేసిన సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి రాష్ట్రంలో వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధించనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో వ్యక్తి వద్ద మూడు కంటే ఎక్కువ మద్యం బాటిల్స్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ […]
మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తూ జగన్ సర్కార్ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించేసిన సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి రాష్ట్రంలో వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధించనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో వ్యక్తి వద్ద మూడు కంటే ఎక్కువ మద్యం బాటిల్స్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం జగన్. ఈ క్రమంలో నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కార్.. పైలట్ ప్రాజెక్ట్ కింద సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దాన్ని అమలుచేస్తోంది. దీని ప్రకారం ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. ప్రతి మద్యం షాపు దగ్గర ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ను నియమించనుంది. పర్మిట్ రూమ్స్ను పూర్తిగా రద్దు చేసింది. ఎమ్మార్పీ రేట్లకే మద్యం, రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయాలు వంటి నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.