బ్రేకింగ్ : శ్రీశైలం ఆలయ ఈవోపై బదిలీ వేటు… వేలం వివాదానికి చెక్
శ్రీశైలంలో దుకాణాల వేలం వివాదానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. షాపుల వేలాన్ని రద్దు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం ఈవో శ్రీరామచంద్రమూర్తిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ కావాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈవో శ్రీరామచంద్ర మూర్తిని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆలయ కొత్త ఈవోగా […]
శ్రీశైలంలో దుకాణాల వేలం వివాదానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. షాపుల వేలాన్ని రద్దు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం ఈవో శ్రీరామచంద్రమూర్తిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ కావాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈవో శ్రీరామచంద్ర మూర్తిని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆలయ కొత్త ఈవోగా K.S.రామారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రామారావు ఏడాదిపాటు ఈవోగా కొనసాగనున్నారు.
కాగా, శ్రీశైలం దేవస్థానం పరిధిలోని దుకాణాల వేలంలో ముస్లింలకు కేటాయించారని బీజేసీ నేతలు, హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలో అన్యమతస్తుల ఆధిపత్యం పెరిగిపోయిందని.. హిందువుల మనోభవాలను ఆలయ అధికారులు దెబ్బతీస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో తీరును నిరసిస్తూ మంగళవారం ఛలో శ్రీశైలం కార్యక్రమానికి పిలుపునిచ్చాయి హిందూ సంఘాలు. ఈ క్రమంలో దుకాణాల వేలాన్ని రద్దుచేస్తూ.. వివాదానికి ఏపీ ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది.