ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు విడుదల
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు రిలీజ్ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు రిలీజ్ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో సంస్థ వ్యూహాలు, మార్కెట్ రీసెర్చి, కన్సల్టెంట్లు, ఇంజినీరింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులు రిలీజ్ చేసినట్టు పరిశ్రమల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కడపలో హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం వివిధ కంపెనీల ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది.
విశాఖలోని మెడ్టెక్ జోన్ ఛైర్ పర్సన్గా పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల వలెవన్ను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య స్థానంలో వలెవన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read :