ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్ధుల కోసం ట్రూనాట్‌ ల్యాబ్‌లు..!

కరోనా నేపధ్యంలో ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే విద్యాసంస్థల పునరుద్దరణ, పరీక్షల నిర్వహణ విషయంలో..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్ధుల కోసం ట్రూనాట్‌ ల్యాబ్‌లు..!
Follow us

|

Updated on: Jun 12, 2020 | 3:41 PM

కరోనా నేపధ్యంలో ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే విద్యాసంస్థల పునరుద్దరణ, పరీక్షల నిర్వహణ విషయంలో కొత్త అకాడెమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాశాఖ రూపొందించినట్లు తెలుస్తోంది. ఏపీలోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ట్రూనాట్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

అటు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇక నుంచి 20 శాతం పాఠాలను ఆన్లైన్ ద్వారానే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ లో బోధించే కంటెంట్ రూపకల్పన కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారట. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాసంస్థల పునః ప్రారంభంపై శ్రద్ధ తీసుకుంటున్నామని.. వర్సిటీల్లో ఉండే మైక్రోబయాలజీ విభాగాలను కూడా బలోపేతం చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ అకాడెమిక్ ఇయ‌ర్ (2020-21) నుంచి ప్రవేటు డిగ్రీ క‌ళాశాల‌ల్లో ఒకే తరహా ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Also Read:

గుడ్ న్యూస్.. ఇకపై మూడు రోజుల్లోనే పెన్షన్ విత్ డ్రా..

మహిళల కోసం మరో సంక్షేమ పధకం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

నేడే ఏపీలో ఇంటర్ ఫలితాలు.. చూసుకోండిలా..

బీటెక్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులరే.!

అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు: చంద్రబాబు

అచ్చెన్నాయుడు అరెస్ట్.. జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది సినిమా..